Posts

Showing posts from 2022

గర్భ రక్షాంభికా స్తోత్రం

Image
గర్భ రక్షాంభికా స్తోత్రం గర్భరక్షాంబికా   అంటే గర్భములో ఉన్న శిశువును , ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా , సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని , తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత , ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది , కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది. నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది , దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు ...

కార్తీకమాసంచివరి రోజు పోలి స్వర్గం కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలు - ఈ ఒక్క దీపం వెలిగిస్తేచాలు.

Image
కార్తీకమాసంచివరి రోజు పోలి స్వర్గం కథ విన్నవారికి అష్ట ఐశ్వర్యాలు - ఈ ఒక్క దీపం వెలిగిస్తేచాలు. పోలి స్వర్గం కార్తీకమాసం   చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ ‘ పోలిస్వర్గం ’. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి … . నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి.. నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతఃకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు. బియ్యపుపిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలిస్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు. ఈ పర్వదినానికి పోలిస్వర్గం అని ఎందుకు వచ్చిందో అని తెలిపేందుకు ఒక కథ వుంది. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము , ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది.ఈ నోము జరుపుకోవడ...

శ్రీ కేదారేశ్వర వ్రత కథ

Image
శ్రీ కేదారేశ్వర వ్రత కథ శ్రీకేదారేశ్వరవ్రతకథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని యుండెను. సిద్ధ - సాధ్య - కింపురుష - యక్ష - గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించు చుండిరి. ఋషులు - మునులు - అగ్ని - వాయువు - వరుణుడు - సూర్యచంద్రులు - తారలు - గ్రహాలు - ప్రమదగణాలు - కుమారస్వామి - వినాయకుడు - వీరభద్రుడు - నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల - సాల - తమలా - వకుళ - నరికేళ - చందన - పనస - జంభూ వృక్షములతోను చంపక - పున్నాగ - పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను , శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి అంకతలమున గల ...

మార్గశిర మాసం ముక్తికి మార్గం

Image
                                            మార్గశిర మాసం ముక్తికి మార్గం 24-11-2022 నుంచి  మార్గశిరమాసారంభం " # మార్గశిరమాసం " - ముక్తికి మార్గం ◆ మార్గశిర మాసం అనగా..... చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించేనెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. భగవద్గీతలోని విభూతియోగంలో - "మాసానాం మార్గశీర్షం" మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి. అందుకే.... మార్గశిర మ...